మౌనించిన నిశ్శబ్దాలు
మిగిలే ఉన్న నీ ఆనవాళ్ళు
చూపునై నింగిలోతారాడుతున్నా
వెలుగుతో ఒలికొస్తావేమోనని
మందహాసమూ బందీ అయ్యి
చింతల చీకటి మింగేస్తుంటే
ఎడారైన మనసులో ఇంకా
కొలువుదీరే ఉన్నాయి కన్నీళ్ళు
చెరిగిపోని శిలాక్షరాలుగా
చిరునవ్వులు చేజారయనేగా
చూపులన్నీజాలిగా పలకరిస్తున్నాయి...!!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి